భారతదేశం, ఆగస్టు 22 -- అభివృద్ధి అంటే కేవలం భారీ పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీల ఏర్పాటు మాత్రమే కాదని, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడమే నిజమైన అభివృద్ధి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదికలో పాల్గొని పలు కీలక విషయాలను ప్రజలతో పంచుకున్నారు.

అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాల తాగునీటి, పారిశ్రామిక అవసరాల కోసం సెప్టెంబరు తొలివారంలోనే గోదావరి జలాలను రప్పించనున్నట్లు సీఎం ప్రకటించారు. జిల్లాలోని ప్రతి చెరువును, రిజర్వాయర్‌ను నింపే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

విశాఖ, అనకాపల్లి ప్రాంతాలు భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీకి ప్రధాన కేంద్రాలుగా మారబోతున్నా...