భారతదేశం, ఏప్రిల్ 2 -- భారత స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో కుప్పకూలాయి. ఏప్రిల్ 2వ తేదీ ఉదయం నుంచే నష్టాలతో ప్రారంభమైన సూచీలు, సమయం గడిచేకొద్దీ తీవ్ర పతనానికి గురయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1,500 పాయింట్లకు పైగా (2%) క్షీణించి 71,608 కనిష్ట స్థాయిని తాకింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 450 పాయింట్లకు పైగా నష్టపోయి 22,209 వద్ద ట్రేడయ్యింది. నిన్నటి లాభాలను తుడిచిపెడుతూ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలడం ఇన్వెస్టర్లను ఆందోళనలో పడేసింది.

మార్కెట్ల పతనంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. కేవలం ఒక్క రోజులోనే దాదాపు రూ. 9 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ క్రితం సెషన్‌లో రూ. 422 లక్షల కోట్లుగా ఉండగా, నేటి పతనంతో అది రూ. 413 లక్షల కోట్లకు...