భారతదేశం, ఫిబ్రవరి 18 -- తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి(TG BIE) ఫిబ్రవరి 25 నుండి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు రియల్ టైమ్ సీసీటీవీ పర్యవేక్షణను ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లోని కీలక ప్రదేశాలలో కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1,495 పరీక్షా కేంద్రాల్లో ఏడు నుండి ఎనిమిది సీసీటీవీ కెమెరాల వరకు అమర్చారు. ఈ కెమెరాలు చీఫ్ సూపరింటెండెంట్ గది, కారిడార్లు, ప్రధాన ద్వారం, పరీక్ష కేంద్రాల వెనుక వైపు కవర్ చేస్తాయి. ఆల్‌రెడీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ద్వారా ప్రశ్నపత్రాలు సమయానికి తెరవబడుతున్నాయో లేదో అధికారులు పర్యవేక్షిస్తారు. ఆలస్యంగా వచ్చిన వారిని ట్రాక్ చేస్తారు, పరీక్షా హాళ్లలోకి మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లకుండా చూసుకుంటారు. హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించిన సీసీటీవీ ఫీడ్‌...