భారతదేశం, ఆగస్టు 31 -- CM Revanth Reddy 1000 Days Rule : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 1న 1,000 రోజుల పాలనా మైలురాయిని పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం 'ప్రగతి నివేదిక'ను ఆదివారం విడుదల చేసింది. ప్రజా ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ, సామాజిక న్యాయమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని పేర్కొంది. రైతులు, మహిళలు, యువతలో కొండంత విశ్వాసం నింపడంతో పాటు భారీగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనతో తెలంగాణ చరిత్రలో రేవంత్ ప్రభుత్వం ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని వివరించింది.

ప్రగతి నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించే దిశగా ప్రభుత్వం చేపట్టిన సాహసోపేత నిర్ణయాలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానిక...