భారతదేశం, సెప్టెంబర్ 11 -- Secunderabad Sirpur Kaghaznagar Special Trains : రాబోయే పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ - హైదరాబాద్ మార్గంలో ప్రత్యేక అన్‌రిజర్వ్డ్ జనసాధారణ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనుంది.

ఈ ప్రత్యేక రైళ్ల సేవలు 2026 సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో అందుబాటులో ఉంటాయి. ముందస్తు రిజర్వేషన్ అవసరం లేని సాధారణ బోగీలు మాత్రమే ఉండే ఈ రైళ్లు సాధారణ మరియు పేద ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

ఈ ప్రత్యేక రైలు సెప్టెంబర్ 12 మరియు 13 తేదీల్లో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12:10 గంటలకు బయలుదేరి, అదే రోజు సాయంత్రం 17:30 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ఈ రైలు సెప్టెంబర్...