భారతదేశం, సెప్టెంబర్ 6 -- ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల ప్రజలకు సింగరేణి ప్యాసింజర్(ప్రస్తుతం సింగరేణి ఎక్స్‌ప్రెస్) కేవలం ఒక రైలు మాత్రమే కాదు.. అదొక సజీవ జ్ఞాపకం, వేలాది కుటుంబాల జీవననాడి. నల్లబంగారు నేలలో నిరంతరం శ్రమించే బొగ్గు గని కార్మికుల చెమట చుక్కలకు, పల్లెటూరి రైతుల ఆశలకు, విద్యార్థుల భవిష్యత్తు కలలకు ఐదు దశాబ్దాలుగా వారధిగా నిలిచిన ఈ ఐకానిక్ రైలు విజయవంతంగా 50 వసంతాలు పూర్తిచేసుకుంది.

1960ల కాలంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL) రామగుండం, బెల్లంపల్లి, మందమర్రి ప్రాంతాల్లో బొగ్గు గనుల తవ్వకాలను విస్తృతంగా ప్రారంభించింది. దీంతో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నుంచి వేలాది మంది గ్రామీణ యువకులు, కార్మికులు ఉపాధి కోసం ఈ బొగ్గు గని ప్రాంతాలకు వలస వచ్చారు.

అప్పట్లో రవాణా సౌకర్యాలు చాలా పరిమితంగా...