భారతదేశం, ఆగస్టు 28 -- Singareni Gold Exploration Karnataka : బొగ్గు గనుల తవ్వకాల్లో శతాబ్దానికి పైగా విశేష అనుభవం ఉన్న తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) తన వ్యాపార విస్తరణలో భాగంగా మరో చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా లింగదహళ్లి గ్రామానికి సమీపంలో ఉన్న దేవదుర్గ బ్లాక్‌లో ప్రతిష్టాత్మకమైన బంగారం, రాగి (కాపర్) ఖనిజ నిక్షేపాలా అన్వేషణ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రారంభించింది.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి ఈ మైనింగ్ ఎక్స్‌ప్లోరేషన్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన అధికారులతో కలిసి ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన స...