భారతదేశం, ఏప్రిల్ 5 -- సింగరేణిలో కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న యూనియన్ బ్యాంక్... మరో కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి యాజమాన్యం చేసిన సూచనల మేరకు.. సహజ మరణం చెందిన కార్మికులకు కూడా ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది.

యూనియన్ బ్యాంకులో కార్పొరేట్ శాలరీ అకౌంట్ కలిగి ఉన్న కార్మికులు లేదా అధికారులు ఎవరైనా సరే మృతి చెందినట్లయితే వారికి రూ. 10 లక్షల బీమా సౌకర్యాన్ని వర్తింపజేయనుంది. ఈ మేరకు సింగరేణి సంస్థకు బ్యాంక్ యాజమాన్యం సమాచారం అందజేసింది.

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇది అమలులోకి రానున్నట్లు బ్యాంకు యాజమాన్యం పేర్కొంది. 2024 లో రాష్ట్ర ప్రభుత్వం చొరవతో సింగరేణి కార్మికులకు ఉచిత కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని యూనియన్ బ్యాంకు అమలు చేసింది.

ఈ ఒప్పందానికి కొనసాగింపుగా సహజ మరణానికి కూడా 10 లక్షల రూపాయల బీమాను వ...