భారతదేశం, ఆగస్టు 11 -- హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ 2026 జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో (Q1 FY27) అద్భుతమైన ఆర్థిక ఫలితాలను సాధించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ రాబడి రూ.182.4 కోట్లకు చేరింది. క్రితం ఏడాదితో పోలిస్తే కార్యకలాపాలు వేగవంతమవ్వడమే కాకుండా, వ్యూహాత్మక కొనుగోళ్లతో కంపెనీ తన ఉనికిని మరింత బలపరుచుకుంటోంది.

కంపెనీ ఆర్థిక నివేదిక ప్రకారం, ఈ త్రైమాసికంలో స్థూల లాభం రూ.76.2 కోట్లుగా (41.8% మార్జిన్) నమోదైంది. గత నాలుగో త్రైమాసికంలో ఉన్న 38.1 శాతం స్థూల మార్జిన్‌తో పోలిస్తే ఇది 370 బేసిస్ పాయింట్లు పెరిగింది. కంపెనీ EBITDA రూ.27.3 కోట్లకు (14.9% మార్జిన్) పెరగ్గా , పన్నుల తర్వాతి నికర లాభం (PAT) రూ.7.9 కోట్లను తాకింది. ముడిసరుకుల ధరల భారాన్ని తగ్గించుకోవడానికి...