భారతదేశం, మార్చి 17 -- హైదరాబాద్, మార్చి 17, 2026: దేశీయ ఫార్మా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పేరంటరల్స్ లిమిటెడ్ (SAI Parenteral's Limited), స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. తన ప్రతిపాదిత ఐపీఓ (IPO) కోసం రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (RHP)ను ఆర్వోసీ, సెబీ (SEBI)తో పాటు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించినట్లు కంపెనీ ప్రకటించింది.

ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 285 కోట్ల విలువైన కొత్త షేర్లను (Fresh Issue) జారీ చేయడంతో పాటు, ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టర్ల నుంచి 31,57,880 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించనుంది. షేరు ధరను Rs.372 నుంచి Rs.392 మధ్య నిర్ణయించారు.

ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఆఫర్ ఫర్ సేల్‌లో కేవలం ఇన్వెస్టర్లు మాత్రమే తమ వాటాలను విక్రయిస్తున్నారు. కంపెనీ ప్రమోటర్లు లేదా ప్రమోటర్ గ్రూప్...