భారతదేశం, జూన్ 29 -- విజయవాడలో గాదె సాయికృష్ణ మరణం కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుకు కుడిభుజాలుగా వ్యవహరించిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. సీఐ అరెస్ట్ అయినప్పటి నుంచి పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని సూర్యారావుపేట ఏసీపీ కార్యాలయానికి వచ్చి స్వయంగా లొంగిపోయారు. సాయికృష్ణ మృతి వెనుక వీరు సీఐ నాగరాజుకు పూర్తిస్థాయిలో సహకరించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారించింది.

సిట్ విచారణలో లొంగిపోయిన ఈ ఇద్దరు పోలీసుల విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని అసాంఘిక కార్యకలాపాలకు వీరే సూత్రధారులని తేలింది. హెడ్ కానిస్టేబుల్ అశోక్ స్టేషన్ పరిధిలోని బార్లు, మద్యం దుకాణాలు, లాడ్జీలు.. ఇతర విషయాలను చూసుకునేవాడు. అంతేకాకుండా.. సివిల్...