భారతదేశం, సెప్టెంబర్ 14 -- పండుగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ సర్వీసులతో పాటు అదనంగా వివిధ నగరాలకు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా పండుగ సమయాల్లో ప్రత్యేక బస్సులపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తుంటారు. అయితే ఈసారి ప్రయాణికులపై ఎలాంటి అదనపు భారం పడకుండా సాధారణ ఛార్జీలకే ఈ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది.

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఈ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్‌ నుంచి చాలా బస్సులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నగరం నుంచి ఏపీలోని వివిధ పట్టణాలకు అనేక బస్సులను కేటాయించారు.

విజయవాడ: 1 డాల్ఫిన్ క...