భారతదేశం, జూన్ 20 -- మధుమేహం (డయాబెటిస్) అనగానే చాలామందికి రక్తంలో చక్కెర స్థాయిలు, ఆహార నియమాలు, గుండె లేదా కిడ్నీ సమస్యలే గుర్తొస్తాయి. కానీ, ఈ మహమ్మారి కంటి చూపును ఎంతలా గుల్ల చేస్తుందనే విషయాన్ని చాలామంది గుర్తించరు. డయాబెటిస్ వల్ల కంటి లోపల జరిగే నష్టం అత్యంత నిశ్శబ్దంగా, తీవ్రంగా ఉంటుంది.

ఇండియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ ఆప్తాల్మాలజీ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ దిగ్భ్రాంతికర నిజాలు వెల్లడయ్యాయి. కంటి చూపు బాగుంది కదా అని భావిస్తూ, దాదాపు 60 శాతానికి పైగా బాధితులు కంటి పరీక్షలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ పరిశోధన పేర్కొంది. డయాబెటిస్ వల్ల వచ్చే కంటి సమస్యలు ఎలాంటి నొప్పి లేదా చూపులో మార్పులు లేకుండానే ఏళ్ల తరబడి లోపల పెరిగిపోతుండటం ఇక్కడి అసలు ప్రమాదం.

భాగ్యనగరంలో ఐటీ ప్రొఫెషనల్స్, మధ్య వయస్కులు, యువతలో ష...