భారతదేశం, జూన్ 18 -- ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తులకు, తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఒక భారీ ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ నల్లమల అడవుల మీదుగా సరికొత్త నాలుగు వరుసల (4 Lane) ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆధ్యాత్మిక పర్యాటక రంగానికి బూస్ట్ ఇచ్చేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు.

నేషనల్ హైవే 765 పరిధిలో నిర్మించనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.12,000 కోట్లు. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా డోర్నాల నుండి తెలంగాణలోని బ్రాహ్మణపల్లి వరకు మొత్తం 86.74 కిలోమీటర్ల పొడవునా ఈ ఎలివేటెడ్ కారిడార్ (ఫ్లైఓవర్ తరహా వంతెన రహదారి) నిర్మించనున్నారు....