భారతదేశం, జూలై 18 -- జులై చివరి రోజుల్లో అంతరిక్షంలో రెండు పెద్ద గ్రహాల కదలికలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. జులై 19న జ్ఞానాన్ని, సంపదను ప్రసాదించే బృహస్పతి (గురుడు) పుష్య నక్షత్రంలో మూడో స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే.. అంటే జూలై 27న శని తిరోగమనం చెందబోతున్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రెండు పెద్ద గ్రహాల మార్పుల ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ, కొన్ని రాశుల వారికి మాత్రం ఈ సమయం అత్యంత కీలకంగా మారనుంది.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పెద్ద గ్రహాలు నక్షత్ర రాశిని మార్చినప్పుడు లేదా వక్రగతి (తిరోగమనం) పట్టినప్పుడు ఆ ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది. బృహస్పతి నక్షత్ర మార్పు వల్ల విద్య, సంపద, శుభకార్యాలు ఊపందుకుంటే... శని తిరోగమనం వల్ల ప్రజలు తమ పాత పనులు, గత నిర్ణయాలు మరియు బాధ్యతలపై పునరాలోచన చేయాల్సి వస్తుంది....