భారతదేశం, ఆగస్టు 31 -- ఒక ఊరికి రైలొస్తే అక్కడ కేవలం రైల్వే స్టేషన్ తో పాటు... దానివెంటే ఒక మార్కెట్ వస్తుంది. పరిశ్రమలు వస్తాయి. సరికొత్త ఆర్థిక వ్యవస్థ ఊపిరిపోసుకుంటుంది. కోస్తా తీరం నుంచి రాయలసీమ సరిహద్దుల వరకు ఆంధ్రప్రదేశ్ భూగోళాన్ని గమనిస్తే... ఇక్కడ పడే ప్రతి రైలు పట్టా, ఇక్కడి రైతు శ్రమను దేశానికి అనుసంధానించే ఒక లైఫ్ లైన్ గా కనిపిస్తుంది. అందుకే ఏపీ భవిష్యత్తును సరికొత్తగా ఆవిష్కరించడంలో రైల్వే మౌలిక వసతులే కీలక భూమిక పోషిస్తాయి.

2026 జూన్ 1న విశాఖపట్నం కేంద్రంగా 'సౌత్ కోస్ట్ రైల్వే జోన్' అందుబాటులోకి రావడం దశాబ్దాల పోరాటానికి లభించిన విజయం. అయితే ఈ జోన్ సాధించుకోవడంతోనే మన బాధ్యత అయిపోలేదు, అసలైన సవాలు ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే, ఈ అవకాశాన్ని నిరంతర క్రియాశీలక కార్యాచరణగా మలచాల్సిన బాధ్యత ఉన్నది.

ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడ, ...