భారతదేశం, జూలై 5 -- నైరుతి రుతుపవనాల రాకతో సముద్రంలో ఏర్పడిన అల్లకల్లోల వాతావరణం, బలమైన ఈదురుగాలుల కారణంగా విశాఖపట్నం తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఏడుగురు మత్స్యకారులతో కూడిన బోటు బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతు కాగా.. మరో వ్యక్తిని కాపాడారు.

విశాఖపట్నం ఫిషింగ్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు తెలిపిన వివరాల ప్రకారం... జూలై 1వ తేదీన ఈ ఏడుగురు మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం వారు జూలై 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకల్లా తిరిగి తీరానికి చేరుకోవాల్సి ఉంది. ఈ మేరకు వారు తమ కుటుంబ సభ్యులకు కూడా ముందుగా సమాచారం అందించారు.

శనివారం (జూలై 4) మధ్యాహ్నం దాటినా మత్స్యకారులు తిరిగి రాకపోవడం, వారి మొబైల్ ఫోన్లు అన్నీ స్విచ్ఛాప్ రావడంతో ఆందోళన చెం...