భారతదేశం, సెప్టెంబర్ 1 -- తెలంగాణలోని ప్రముఖ ఉన్నత విద్యాసంస్థలైన ఉస్మానియా యూనివర్సిటీ (OU), కాకతీయ యూనివర్సిటీ (KU) గ్లోబల్ విద్యా రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. జర్మనీకి చెందిన ప్రముఖ ప్రభుత్వ విద్యాసంస్థ రాయ్‌ట్లింగెన్ యూనివర్సిటీతో విద్యా రంగానికి సంబంధించి కీలకమైన అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా బ్యాచిలర్, మాస్టర్స్ కోర్సులు అభ్యసించే విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్య, విదేశీ పరిశ్రమలలో అనుభవం, ఉద్యోగ అవకాశాలు సులభంగా లభించనున్నాయి.

ఐదేళ్ల కాలపరిమితితో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల విద్యాసంస్థల మధ్య నాలెడ్జ్ షేరింగ్, పరిశోధనలు వేగవంతం కానున్నాయి. ప్రారంభంలో కంప్యూటర్ సైన్స్, ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ విభాగాలలో ఈ కార్యక్రమాలను అమలు చేస్తారు.

రాబోయే రోజుల్లో డిజిటల...