భారతదేశం, జూన్ 1 -- దేశంలో విద్యార్థుల భవిష్యత్తును అతలాకుతలం చేస్తున్న పేపర్ లీకేజీల వ్యవహారంపై సోషల్ మీడియాలో ప్రజాదరణ పొందిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (Cockroach Janta Party - CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ జూన్ 6న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆయన, ఈ నిరసన కోసమే ప్రత్యేకంగా భారతదేశానికి తిరిగి వస్తున్నారు.

"పేపర్ లీకేజీల వల్ల నీట్ (NEET) రాసిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, లక్షలాది మంది శ్రమ వృథా కావడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మనమంతా భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా ఒకే తాటిపైకి వచ్చి శాంతియు...