భారతదేశం, సెప్టెంబర్ 19 -- పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ (MBU) ప్రక్రియను పూర్తి చేయడానికి సెప్టెంబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించింది. విద్యాశాఖ తరఫున వచ్చే ఆధార్ ఆపరేటర్లను తమ ప్రాంగణాల్లో క్యాంపులు నిర్వహించేందుకు అనుమతించని పాఠశాలలు, జూనియర్ కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

విద్యాశాఖ డిప్యుటేషన్‌పై నియమించిన ఆపరేటర్ల ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక ఆధార్ నమోదు, అప్‌డేట్ క్యాంపులను నిర్వహిస్తున్నారు. హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాళ్లు, విద్యాసంస్థల యాజమాన్యాలు UDISE+ పోర్టల్‌లోకి లాగిన్ అయి, తమ పాఠశాల/కళాశాలలో ఏ విద్యార్థులకు బయోమెట్రిక్ అప్‌డేట్ పెండింగ్‌లో ఉందో జాబితాను సరిచ...