భారతదేశం, ఆగస్టు 19 -- తెలంగాణ పాఠశాల విద్యాశాఖ విద్యార్థుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా రెండు కీలక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల అమలును రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించింది. ప్రశస్త్(PRASHAST), స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ 2026(SHVR) పేరిట చేపట్టిన ఈ రెండు కార్యక్రమాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ప్రశస్త్ యాప్ ద్వారా దివ్యాంగత్వ గుర్తిస్తారు. ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో వైకల్యాల ముందస్తు సంకేతాలను గుర్తించనున్నారు. యూడైస్ ప్లస్‌లో ఉన్న దాదాపు 3.65 లక్షల మంది ఉపాధ్యాయులకు ఈ యాప్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు. NCERT/CIET అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ ద్వారా దివ్యాంగుల హక్కుల చట్టం-2016(RPwD Act) గుర్తించిన 21 రకాల వైకల్యాల ల...