భారతదేశం, జూన్ 21 -- సాంకేతికత, సృజనాత్మకత ద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని సమూలంగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా అభియాన్, ప్రముఖ గ్లోబల్ డిజైనింగ్ ప్లాట్‌ఫారమ్ 'కాన్వా' (Canva) మధ్య కుదిరిన అధికారిక భాగస్వామ్యం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులకు రాష్ట్రవ్యాప్తంగా 'కాన్వా ఫర్ ఎడ్యుకేషన్' (Canva for Education) ఉచిత యాక్సెస్‌ను కల్పించిన దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది.

డిజిటల్ లెర్నింగ్, ఫ్యూచర్-రెడీ ఎడ్యుకేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే ప్రభుత్వ సంకల్పంలో ఈ చొరవ మరొక మైలురాయిగా నిలిచింది.

సాంకేతిక అనుకూలతలకు లోబడి, ఈ కాన్వా ప్లాట్‌ఫారమ్‌ను ఏపీ ప్రభుత్వ ...