భారతదేశం, జూన్ 16 -- దేశంలో లేదా విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్లు ఒక గొప్ప ఆర్థిక వనరుగా మారాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే లక్ష్యతో చాలా కుటుంబాలు బ్యాంకుల వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో ఈ రుణాలను అందిస్తున్నాయి.

అయితే, లోన్ తీసుకునేటప్పుడు వడ్డీ రేట్లను క్షుణ్ణంగా పరిశీలించడం చాలా అవసరం. తక్కువ వడ్డీ రేటుకు లోన్ పొంది, చదువు పూర్తయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈఎంఐలు (EMIs) చెల్లించడమే ప్రతి ఒక్కరి ప్రాధాన్యత కావాలి. జూన్ 2026 నాటికి దేశంలోని అగ్రగామి బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్ల వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.

ప్రస్తుతం ప్రభుత్వ రంగానికి చెందిన ఎస్‌బీఐ అత్యంత తక్కువ వడ్డీ రేట్లను అందిస్తుండగ...