భారతదేశం, మే 31 -- విదేశీ విద్యను అభ్యసించాలనుకునే తెలంగాణకు చెందిన మైనారిటీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. హైదరాబాద్‌లోని మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం 'ముఖ్యమంత్రి విదేశీ విద్యా నిధి పథకం (Chief Minister's Overseas Scholarship Scheme) - స్ప్రింగ్ సీజన్ 2026' కింద అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఈ పథకం కింద విదేశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG), పీహెచ్‌డి (Ph.D) వంటి ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం గుర్తించిన దేశాలలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్ పొందిన వారికి ఈ స్కాలర్‌షిప్ వర్తిస్తుంది: అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, సౌత్ కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్‌లో చద...