భారతదేశం, జూన్ 27 -- Vijayawada Division Punctuality App : రైల్వే రవాణా వ్యవస్థలో సరికొత్త డిజిటల్ విప్లవానికి విజయవాడ రైల్వే డివిజన్ శ్రీకారం చుట్టింది. రైళ్లు నడిచే సమయాన్ని, వాటి ఆలస్యాన్ని నిజసమయంలో (Real-time) ట్రాక్ చేసేందుకు పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన "Punctuality BZA" అనే ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను విజయవాడ డివిజన్ అధికారులు శనివారం ఆవిష్కరించారు. భారతీయ రైల్వేలోనే ఇటువంటి అంతర్గత సమయపాలన పర్యవేక్షణ యాప్‌ను ప్రవేశపెట్టడం ఇదే ప్రథమం అని అధికారులు వెల్లడించారు.

విజయవాడ డివిజన్ ఐటీ విభాగం పూర్తిగా అంతర్గతంగా ఈ మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. దీంతో రైల్వే ఆపరేటింగ్ అధికారులు, కంట్రోలర్లు డెస్క్‌టాప్ కంప్యూటర్లపై ఆధారపడకుండా.. ఎక్కడి నుంచైనా తమ మొబైల్ ద్వారానే రైళ్ల కదలికలను సులువుగా పర్యవేక్షించవచ్చు. ఇప్పటివరకు...