భారతదేశం, మార్చి 24 -- హైదరాబాద్ రోడ్లపై వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతున్నప్పటికీ.. 2025 నాటికి సగటు ట్రాఫిక్ వేగంలో గణనీయమైన మెరుగుదల నమోదైంది. Telangana Socio Economic Outlook 2026 ప్రకారం.. ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు ఇంజనీరింగ్ చర్యలలో సాధించిన పురోగతి కారణంగా.. నగర సగటు ప్రయాణ వేగం 2024లో గంటకు 20.1 కిలోమీటర్ల నుండి 2025 నాటికి గంటకు 23.4 కిలోమీటర్లకు పెరిగింది.

గత దశాబ్ద కాలంలో నగరంలో వాహనాల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువైంది. 2014లో 42.2 లక్షలుగా ఉన్న ఈ సంఖ్య, 2025 నవంబర్ నాటికి 94.16 లక్షలకు పెరిగింది. సగటున ప్రతిరోజూ 1,500కు పైగా కొత్త వాహనాలు హైదరాబాద్ రోడ్లపైకి వస్తున్నాయని, ఇది నగర మౌలిక సదుపాయాలపై ఒత్తిడిని తీవ్రతరం చేస్తోందని నివేదిక పేర్కొంది.

2019లో 22 కిలోమీటర్లు, 2016లో 19 కిలోమీటర్లుగా ఉన్న సగటు వేగం, 2021 నాటికి సుమారు 25 కి...