భారతదేశం, డిసెంబర్ 16 -- న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రమాదకర స్థాయికి చేరుకున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ యంత్రాంగం అత్యంత కఠినమైన అస్త్రాన్ని ప్రయోగించింది. ఇకపై ఢిల్లీలోని పెట్రోల్ బంకుల్లో వాహనాలకు ఇంధనం నింపాలంటే 'పొల్యూషన్ అండర్ కంట్రోల్' (PUCC) సర్టిఫికేట్ తప్పనిసరి. చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్ లేకపోతే చుక్క పెట్రోల్ కూడా పోయరని పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా మంగళవారం ప్రకటించారు. ఈ కొత్త నిబంధన ఈ గురువారం నుంచే అమలు కానుంది.
ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యం ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (AQI) వరుసగా మూడు రోజులుగా 'అత్యంత తీవ్రమైన' (Severe) కేటగిరీలో కొనసాగింది. మంగళవారం నాటికి ఇది స్వల్పంగా మెరుగుపడి 'చాలా పేలవమైన' (Very Poor) స్థితికి వచ్చినప్పటికీ, కాలుష్య ముప్పు ఇంకా తొలగలేదు. వాహనాల నుంచి వెలువడే పొగను నియంత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.