భారతదేశం, మే 19 -- జీహెచ్‌ఎంసీకి సంబంధించిన పౌర సేవలను కొత్తగా మీసేవ వాట్సాప్‌, చాట్‌బాట్‌ ద్వారా తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలకు మరింత సౌకర్యం, అందుబాటు, పారదర్శకత కల్పించే దిశగా ఈ సేవలను విస్తరించారు. ఈ మేరకు ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ డెలివరీ విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నాయకత్వంలో మీసేవ ద్వారా పౌర సేవలను మరింతగా తీర్చిదిద్దుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్‌ సేవల ప్రధాన వేదికగా ఉన్న మీసేవను వాట్సాప్‌, చాట్‌బాట్‌ ద్వారా మరింత విస్తరించారు. ఈ అదనపు డిజిటల్‌ ఛానల్‌ను 2025 నవంబర్‌ 18న ప్రారంభించారు.

కొత్తగా జీహెచ్‌ఎంసీ ప్రాపర్టీ అసెస్‌మెంట్‌ రివిజన్‌, జనన ధ్రువీకరణ సవరణ, మరణ ధ్రువీకరణ సవరణ, బర్త్‌ హోమ్‌(ఇంటి దగ్గర పుట్టిన), డెత్‌ హోమ్‌...