వాటర్ బిల్లు కట్టలేదా? కనెక్షన్ కట్ అవుతుందంటూ మెసేజ్ వచ్చిందా? హెచ్చరిక!
భారతదేశం, జూన్ 6 -- హైదరాబాద్ నగరవాసులను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు. ఈసారి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) పేరుతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూ లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. ఈ ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ టి. సాయి మనోహర్ హెచ్చరించారు.
సైబర్ నేరగాళ్లు వినియోగదారుల మొబైల్ ఫోన్లకు వాట్సాప్ మెసేజ్లు, ఎస్ఎమ్ఎస్లు పంపడం లేదా నేరుగా ఫోన్ కాల్స్ చేస్తున్నారు. 'మీ వాటర్ బిల్లు అప్డేట్ కాలేదు, మీ మీటర్ రీడింగ్ నమోదు కాలేదు, లేదా మీ 'క్యాన్' (CAN - Consumer Account Number) వెరిఫికేషన్ పెండింగ్లో ఉంది.' అంటూ నమ్మిస్తారు.
నిబంధనల ప్రకారం వెంటనే వివరాలు అప్డేట్ చేయకపోతే వాటర్ కనెక్షన్ కట్ చేస్తామని బెదిరింపులకు దిగుతారు. ఈ సమస్య పరిష్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.