భారతదేశం, ఆగస్టు 26 -- హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ కీసర క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న ఆరాధ్య కన్వెన్షన్ హాల్‌ ఒక వివాహ మహోత్సవం జరిగింది. తెలంగాణ రక్షణ సేన నాయకుడు, గతంలో తెలంగాణ జాగృతిలో క్రియాశీలకంగా పనిచేసిన బాషబోయిన బాలప్రసాద్, సీతాఫల్‌మండికి చెందిన శివానిల వివాహ వేడుక వైభవంగా జరిగింది.

ఈ కళ్యాణ మహోత్సవంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరుకావడమే కాకుండా, వరుడి కుటుంబంలో ఒక ఇంటి ఆడబిడ్డగా పూర్తి బాధ్యతలు తీసుకుని ముదిరాజ్ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి క్రతువులను దగ్గరుండి జరిపించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాలప్రసాద్‌కు సొంతంగా అక్కాచెల్లెళ్లు లేరు. తెలంగాణ జాగృతి కాలం నుండి కల్వకుంట్ల కవితతో ఉన్న ఆత్మీయ అనుబంధం, గౌరవంతో తన పెళ్లిలో ఆమెనే తన సొంత సోదరి స్థానంలో ఉండి ఆడపడుచుగా వివాహ ఆచారాలను...