భారతదేశం, ఆగస్టు 27 -- రుణాలు తీసుకునే సామాన్యులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీపి కబురు అందించింది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) విధించే వడ్డీ రేట్లు, స్ప్రెడ్‌లు (Spreads), వార్షిక వడ్డీ శాతాల (APR)పై పారదర్శకత తీసుకొచ్చేందుకు నూతన మార్గదర్శకాల ముసాయిదాను విడుదల చేసింది. 2027 ఏప్రిల్ 1 నాటికి ఈ ఏకీకృత నిబంధనావళిని అమల్లోకి తీసుకురావాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.

ప్రస్తుతం వేర్వేరు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు తమ సొంత నిబంధనల ఆధారంగా వడ్డీ స్ప్రెడ్‌ను ఖరారు చేస్తున్నాయి. దీనివల్ల ఒక బ్యాంకు రుణానికి, మరో ఎన్‌బీఎఫ్‌సీ రుణానికి మధ్య ఉన్న తేడాలను, అసలు వడ్డీ వ్యయాన్ని సరిగ్గా పోల్చి చూడటం వినియోగదారులకు కష్టంగా మారుతోంది. హోమ్ లోన్లు, ఎంఎస్ఎంఈ రుణాలు వంటి ఫ్లోటింగ్ రేట్ రుణాల కోసం బ్యాంకులు రెపో రేటు...