భారతదేశం, ఏప్రిల్ 30 -- అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తన పదవీకాలం ముగియడానికి ముందు నిర్వహించిన చివరి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ నిపుణుల అంచనాలకు తగ్గట్టే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) కీలక వడ్డీ రేట్లను 3.5% నుంచి 3.75% శ్రేణిలో యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా వరుసగా మూడోసారి ఫెడ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.

మే 15తో జెరోమ్ పావెల్ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, "గవర్నర్‌గా నా సేవలు కొనసాగుతాయి కానీ, చైర్మన్‌గా ఇదే నా చివరి సమావేశం" అని స్పష్టం చేశారు. తదుపరి సమావేశం జూన్‌లో జరగనుండగా, అప్పటికి డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేసిన కెవిన్ వార్ష్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. నాయకత్వ మార్పు నేపథ్యంలో అమెరికా ...