భారతదేశం, సెప్టెంబర్ 5 -- పగటిపూట ప్రయాణించే సెమీ హైస్పీడ్ రైళ్లుగా గుర్తింపు పొందిన వందే భారత్ ఇప్పుడు రాత్రివేళ ప్రయాణాల వైపు అడుగులు వేస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం వందే భారత్ స్లీపర్ సర్వీసులను విస్తరించేందుకు భారతీయ రైల్వే రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 260 వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేయాలని సంకల్పించింది.

ఈ స్లీపర్ సిరీస్‌లో తొలి రైలు గువాహాటీ-హౌరా మార్గంలో ఇప్పటికే ప్రయాణికులకు అందుబాటులోకి రాగా, రెండో రైలు ప్రస్తుతం పట్టాలపై ట్రయల్ రన్స్ పూర్తి చేసుకుంటోంది. ఈ రెండో రైలును బెంగళూరు - ముంబై మార్గంలో నడిపే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, దీనిపై రైల్వే శాఖ అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

ఈ 260 వందే భారత్ స్లీపర్ రైళ్ల ఉత్పత్తిని పలు ప్రముఖ తయారీ సంస్థలు పంచుకోనున్నాయి. మొదటి 10 స్లీపర్ రైళ...