భారతదేశం, జూన్ 1 -- South Central Railway Weekly Trains 2026 : రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. వేసవి కాలం ముగుస్తున్నప్పటికీ వివిధ రూట్లలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతూనే ఉంది. అదనపు రద్దీని తట్టుకునేందుకు ప్రస్తుతం నడుస్తున్న పలు వీక్లీ స్పెషల్ రైళ్లను మరింత కాలం పొడిగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ పొడిగింపు ద్వారా వివిధ గమ్యస్థానాల మధ్య సెప్టెంబర్ 2026 వరకు అదనంగా మొత్తం 132 రైల్వే సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్, రైళ్ల వివరాలను ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.

ముఖ్యంగా సికింద్రాబాద్, హైదరాబాద్, చర్లపల్లి స్టేషన్ల నుంచి ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ నిర్ణయంతో పెద్ద ఊరట లభించనుంది. తిరుపతి, శ్రీకాకుళం, కొల్లా...