భారతదేశం, ఫిబ్రవరి 22 -- ప్రయాణీకులకు మరింత చేరువయ్యేందుకు వారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు రైల్వేశాఖ సరికొత్ సేవలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు అన్‌రిజర్వ్ డ్ టిక్కెట్ల కోసం వాడుతున్న యూటీఎస్ యాప్ సేవను నిలిపివేసి. ఆ స్థానంలో మరో కొత్త యాప్ ను తీసుకురానుంది.

రైల్వే శాఖ అందించే అన్ని సేవలను ఒకే చోట అందించేందుకు 'రైల్‌వన్ యాప్‌'ను సిద్ధం చేసింది. మార్చి 1వ తేదీ నుంచి ఈ యాప్ ప్రయాణికులను అందుబాటులోకి రానుంది. ప్రయాణీకులు ఇకపై రైల్‌వన్ యాప్‌ను వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచిస్తోంది.

ఈ కొత్త యాప్‌ ద్వారా టికెట్‌ రిజర్వేషన్‌, అన్‌ రిజర్వ్‌డ్‌ , ప్లాట్‌ఫాం టికెట్ల కొనుగోలు, పీఎన్‌ఆర్‌ ఎంక్వయిరీ, జర్నీ ప్లానింగ్‌, రైల్వే స్టేషన్లలో బోగీల పొజిషన్‌, రైలు ప్రయాణ స్థితి, రైలు సహాయ సేవలు, ప్రయాణ సమయంలో మీల్స్‌ బుకింగ్‌ వంటి ...