భారతదేశం, జూన్ 18 -- తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వానాకాలం(ఖరీఫ్) సీజన్‌కు సంబంధించిన 'రైతు భరోసా' పెట్టుబడి సాయం నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26న(జూన్ చివరి వారంలో) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సభకు సంబంధించిన ఏర్పాట్లు వేగవంతం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులను ఆదేశించింది.

వానాకాలం పెట్టుబడి సాయాన్ని సకాలంలో అందించేందుకు ప్రభుత్వం నిధుల సమీకరణను ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6...