భారతదేశం, మే 30 -- తెలంగాణలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు(రైతులకు) ఎలాంటి మీటర్లు అమర్చే ప్రసక్తే లేదని తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ (TGRPDCL) సీఎండీ మహమ్మద్ ముషారఫ్ అలీ ఫరూఖీ స్పష్టం చేశారు. కొత్త డిస్కాం ఏర్పాటు ఉద్దేశం రైతులకు మెరుగైన సేవలు, నాణ్యమైన విద్యుత్‌ను అందించడమేనని ఆయన ఉద్ఘాటించారు.

కొత్త డిస్కాంకు పంపిణీ లైసెన్స్ మంజూరు చేయాలని కోరుతూ 'టీజీఆర్పీడీసీఎల్' దాఖలు చేసిన దరఖాస్తుపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి నిర్వహించిన బహిరంగ విచారణలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ రంగ సంస్కరణలు, కొత్త డిస్కాం ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన వివరంగా మాట్లాడారు.

ప్రత్యేక డిస్కాం ఏర్పాటు అనేది ఏకపక్షంగా లేదా తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం కాదని సీఎండీ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జూలై 30, 2025న కొత్త డిస్కాం ఏర్పాటును...