భారతదేశం, ఆగస్టు 7 -- హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి వైద్యులు మరొక అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. 'యాంటీ-సింథటేజ్ సిండ్రోమ్' (Anti-synthetase Syndrome) కారణంగా ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని, శ్వాస తీసుకోవడం కూడా భారంగా మారిన 47 ఏళ్ల పురుషుడికి రెండు ఊపిరితిత్తుల మార్పిడి చేసి ఊపిరి పోశారు. రెండేళ్లుగా నిరంతరం ఆక్సిజన్ సపోర్టుపైనే ఆధారపడిన సదరు బాధితుడు, ఈ ఆపరేషన్ తర్వాత స్వయంగా శ్వాస తీసుకుంటూ ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లారు.

బాధితుడు 'ఫైబ్రోటిక్ ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజ్' (ILD) అనే తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి వల్ల ఊపిరితిత్తుల కణజాలం గట్టిపడి (సాధారణ ಭాషలో చెప్పాలంటే ఊపిరితిత్తులపై మచ్చలు ఏర్పడి) శ్వాస తీసుకునే సామర్థ్యాన్ని శాశ్వతంగా కోల్పోతారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా వ్యాధి...