భారతదేశం, మార్చి 18 -- రాజకీయాల్లో మాటల యుద్ధం ముదురుతోంది. ముఖ్యంగా బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్.. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీని ఒక 'టపోరి' (వీధి రౌడీ లేదా పోకిరీ) తో పోల్చిన కంగనా, ఆయన బహిరంగ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

పార్లమెంట్ సముదాయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కంగనా రనౌత్, రాహుల్ గాంధీ ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

"ఆయన్ను చూస్తుంటే మా మహిళలకు చాలా అసౌకర్యంగా (Uncomfortable) అనిపిస్తుంది. ఆయన ఒక టపోరిలా వస్తారు.. ఎవరినైనా 'ఏయ్ నువ్వు' అంటూ ఏకవచనంతో అగౌరవంగా పిలుస్తారు. ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తుంటే వెనుక నుంచి కూతలు కూస్తారు (Hooting)" అని కంగనా రనౌత్ ఘాటుగా విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రవర్తన ఏమాత...