భారతదేశం, ఆగస్టు 2 -- విజయవాడ ఆటోనగర్‌లోని ఏపీఐఐసీ రైతు బజార్‌లో వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినియోగదారులకు భారీ ఊరటగా రూ.52కే కిలో నాణ్యమైన సన్న బియ్యం అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం.

150 రైతు బజార్లు, 500 రైస్‌మిల్ అవుట్‌లెట్లలో విక్రయాలు ప్రారంభం అయ్యాయి. ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులకు ఉపశమనం కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

బహిరంగ మార్కెట్‌లో కిలోకు సుమారు రూ.10 వరకు ధరలు పెరిగినట్లు గుర్తించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌తో కలిసి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం సరఫరా నిర్ణయం తీసుకుంది సర్కార్. బీపీటీ స్టీమ...