భారతదేశం, మే 13 -- Eating fruits after dinner : రాత్రి భోజనం ముగించగానే ఏదో ఒక తీపి పదార్థం తినాలనిపించడం చాలామందికి అలవాటు. అయితే ఐస్‌క్రీమ్‌లు లేదా స్వీట్లు ఆరోగ్యానికి అంత మంచిది కాదని భావించి.. చాలామంది పోషకాలతో నిండిన పండ్లను ఎంచుకుంటారు. పండ్లు ఆరోగ్యకరమే అయినప్పటికీ, వాటిని తినే సమయం కూడా అంతే ముఖ్యం. భోజనం తర్వాత పండ్లు తినడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయనే అంశంపై ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సాహిల్ నోహ్రియా పలు కీలక విషయాలను వివరించారు.

సాధారణంగా పండ్లు చాలా తేలికగా జీర్ణమవుతాయి. ఇవి కడుపులోకి వెళ్ళిన 20 నుంచి 40 నిమిషాల్లోనే జీర్ణం కావాల్సి ఉంటుంది. కానీ, భారీ భోజనం చేసిన వెంటనే పండ్లను తింటే సమస్యలు మొదలవుతాయి. మన శరీరం అప్పటికే భోజనంలోని కొవ్వులు, కార్బోహైడ్రేట్లను అరిగించే పనిలో ఉండటం వల్ల, పండ్లు జీర్ణాశ...