భారతదేశం, మే 17 -- నాణ్యమైన నిద్ర లేకపోవడం చాలా మందికి ఒక పెద్ద సమస్యగా మారింది. ఒత్తిడి, రాత్రిపూట మొబైల్ ఫోన్ వాడకం, మరియు తీరికలేని జీవనశైలి కారణంగా గంటల తరబడి మంచం మీద నిద్ర కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. అటు ఇటు బొర్లినా సరిగా నిద్రరాదు. నిద్రపోయే ముందు కొన్ని అలవాట్లను పాటించడం వల్ల నిద్ర నాణ్యతను మెరుగుపరచవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పడుకునే ముందు స్నానం చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి లభించి, మనసు ప్రశాంతమవుతుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి, మంచి నిద్రకు దోహదం చేస్తుంది. శాస్త్రవేత్తల ప్రకారం రాత్రిపూట మన శరీర ఉష్ణోగ్రత సహజంగా కొద్దిగా తగ్గుతుంది. ఈ ప్రక్రియ శరీరానికి నిద్రకు సంకేతం ఇస్తుంది. అందువల్ల గోరువెచ్చని నీటితో స్నానం తర్వాత శరీరం క్రమంగా చల్లబడుతుంది. ఇది త్వరగా, గాఢ నిద్ర పట్టడానిక...