భారతదేశం, మార్చి 16 -- ఒడిశా రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. రాజధాని భువనేశ్వర్‌లో ఓటు వేసే సమయంలో అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి), ప్రతిపక్ష బిజు జనతా దళ్ (బిజెడి) ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది కాస్తా ముదిరి ఇరు వర్గాల మధ్య తోపులాట, భౌతిక దాడుల వరకు వెళ్లడంతో అసెంబ్లీ ప్రాంగణంలో గందరగోళం నెలకొంది.

ఈ ఎన్నికల్లో బిజెపి అనైతిక మార్గాల్లో ఓట్లను దక్కించుకోవాలని చూస్తోందని బిజెడి తీవ్రంగా మండిపడింది. "బిజెపి నేతలు బిజెడి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని మా ఎమ్మెల్యేలు అడ్డుకోవడంతో వారిపై దాడులకు తెగబడ్డారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే, ఇక సామాన్య పౌరుల పరిస్థితి ఏంటి? మేము ఎవరిపై దాడి చేయలేదు, బిజెపి ఎమ్...