భారతదేశం, సెప్టెంబర్ 16 -- "రాజు పదునైన వ్యూహాలతో శక్తిమంతుడిగా ఉంటే ఆ రాజ్యం పురోగతి సాధించడమే కాకుండా, శత్రు దేశాలు కన్నెత్తి చూడడానికి కూడా జంకుతాయి.." అని రాజనీతిజ్ఞడు చాణుక్యుడు చెప్తారు. ఇప్పుడు అదే తరహాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలన సాగుతున్నది. ఒక సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన నరేంద్ర మోదీ ప్రయాణం... గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధానమంత్రి పదవి వరకు ఎదిగిన ప్రస్థానం.. వడోదర నుంచి వారణాసి వరకు సాగిన రాజకీయ ప్రస్థానం.. ఎన్నికల్లో ఓటమి ఎరుగని నాయకుడిగా నిలిచిన ప్రస్థానం.. ఇప్పుడు 'వికసిత్ భారత్-2047' సంకల్పంతో ముందుకు సాగుతోంది.

2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ 2026 అక్టోబర్ 7న ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటారు. సెప్టెంబర్ 17న 76వ జన్మదినాన్ని జరుపుకోనున్న మోదీకి ఈ ర...