భారతదేశం, సెప్టెంబర్ 11 -- డిజిటల్ చెల్లింపుల రంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) గురువారం కీలక సంస్కరణలు చేపట్టింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) వ్యవస్థలో ఫోన్ 'టాప్' చేస్తే సరిపోయే సౌకర్యంతో పాటు వినియోగదారుల సేవల నిర్వహణ కోసం ఒకే డిజిటల్ విండోను అందుబాటులోకి తెచ్చింది.

గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026 వేదికగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ నూతన సేవలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్పీసీఐ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, ఇండిపెండెంట్ డైరెక్టర్ అజయ్ కుమార్ చౌదరి, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు, ఫిన్‌టెక్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

కొత్తగా వచ్చిన 'టాప్ అండ్ పే' ఫీచర్‌తో పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) టెర్మినల్స్ వద్ద స్మార్ట్‌ఫోన్ అన్‌లాక్ చేసి, సదరు...