భారతదేశం, సెప్టెంబర్ 18 -- గర్భవతిగా ఉన్న భార్యను దారుణంగా అంతమొందించాడనే ఆరోపణలతో అరెస్టయి, ఇటీవలె బెయిల్‌పై బయటకు వచ్చిన ఒక వ్యక్తి నిజామాబాద్ నగరంలో దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని రాజారాజేంద్ర (ఆర్‌ఆర్‌) సెంటర్‌ వద్ద గురువారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతడిని వేటకొడవలితో నరికి చంపిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

పోలీసులు అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని ఆర్‌ఆర్‌ చౌరస్తా వద్ద గురువారం సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో 26 ఏళ్ల చితారి హరిబాబు వెళ్తుండగా.. ఒక కారులో వచ్చిన దుండగులు అతడిని టార్గెట్ చేశారు.

"కారులో నుంచి ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు వచ్చారు. వారిలో ఒకడు హరిబాబును వెంబడించి కొబ్బరికాయలు నరికే పెద్ద వేటకొడవలితో అతడి మెడ, తలపై తీవ్రంగా నరికాడు" అని నిజామాబాద్ ఏసీపీ బి. ప్రసాద్ వెల్లడించ...