భారతదేశం, జూన్ 10 -- రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడే ఒక సాధారణ సెక్యూరిటీ గార్డు జీవితం ఒకే ఒక్క ఈమెయిల్‌తో రాత్రికి రాత్రే మారిపోయింది. యూఏఈ లక్కీ డే లాటరీ డ్రాలో అతనికి ఏకంగా 15 కోట్ల రూపాయల జాక్‌పాట్ తగిలింది. అప్పటివరకు నెలకు వచ్చే కొద్దిపాటి జీతంతో బతుకుబండి లాదిన ఆ యువకుడు ఇప్పుడు కోటీశ్వరుడిగా మారిపోయాడు.

అబుదాబిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన 26 ఏళ్ల తయాబ్ ఖాన్ ఈ అదృష్టవంతుడు. మే 27న ఈద్ అల్ అధా సెలవుల్లో రాత్రి డ్యూటీలో ఉన్న సమయంలో అతనికి లాటరీ తగిలినట్లు ఈమెయిల్ వచ్చింది. తయాబ్ ఖాన్‌తో పాటు అతని నలుగురు స్నేహితులు కలిసి దాదాపు 30 మిలియన్ దిర్హామ్‌ల (సుమారు రూ.78 కోట్లు) బంపర్ ప్రైజ్ గెలుచుకున్నారు. వీరంతా కలిసి ఒక్కొక్కరు 50 దిర్హామ్‌లు వేసుకుని ఈ టికెట్ కొన్నారు. ప్రైజ్ మనీని సమానంగా పంచుకోవడంతో తయాబ్ వాట...