భారతదేశం, సెప్టెంబర్ 2 -- అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు కొత్త సవాళ్లు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ ఆధారిత వీసా ప్రోగ్రామ్‌ల వినియోగంపై విచారణను విస్తరించే దిశగా ట్రంప్ యంత్రాంగం అడుగులు వేస్తోంది. అమెరికన్ కార్మికులను నియమించుకోవడానికి బదులుగా జే-1 ఎక్స్ఛేంజ్ విజిటర్లు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ఉద్యోగులను వాడుకుంటూ కాలేజీలు వేతనాలను తగ్గిస్తున్నాయా అనే కోణంలో దర్యాప్తు జరపవచ్చని యూఎస్ కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డీఎస్పోసిటో సంకేతాలిచ్చారు.

"విశ్వవిద్యాలయాలు అమెరికన్ కార్మికులకు బదులుగా జే-1, ఓపీటీ వర్కర్లను వాడుకోవడం ద్వారా కోట్ల డాలర్లు ఆదా చేస్తున్నాయా? చట్టం ఉద్దేశించినట్లే ఈ ప్రోగ్రామ్‌లను ఉపయోగిస్తున్నారా?" అని సెప్టెంబరు 1, 20...