భారతదేశం, మార్చి 4 -- పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతుండటంతో భారత స్టాక్ మార్కెట్ బుధవారం రక్తసిక్తమైంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు ఐదో రోజుకు చేరడం, ఉద్రిక్తతలు మరింత ముదిరే సూచనలు కనిపిస్తుండటంతో మదుపర్లు ఆందోళనకు గురయ్యారు. ఫలితంగా రిస్కీ అసెట్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగి, ప్రధాన సూచీలు భారీగా పతనమయ్యాయి.

నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 50 సూచీ 1.55 శాతం (380 పాయింట్లు) నష్టపోయి 24,480 వద్ద స్థిరపడింది. అటు సెన్సెక్స్ ఏకంగా 1,122 పాయింట్లు (1.40 శాతం) కోల్పోయి 79,116 వద్ద ముగిసింది. ఒక దశలో సూచీలు 2 శాతానికి పైగా పడిపోయి ఇన్వెస్టర్లను వణికించాయి. వరుసగా మూడో సెషన్‌లోనూ రెండు సూచీలు 1 శాతం కంటే ఎక్కువ నష్టపోవడం గమనార్హం. కేవలం లార్జ్ క్యాప్ షేర్లే కాకుండా, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూ...