భారతదేశం, మార్చి 17 -- మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడటానికి కేవలం రెండు రోజుల ముందు, తెర వెనుక ఒక భారీ దౌత్య ప్రయత్నం జరిగినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సంచలన విషయాలను బయటపెట్టారు. అమెరికాతో జరిగిన చర్చల్లో భాగంగా, ఇరాన్ తన వద్ద ఉన్న సుమారు 440 కిలోల అత్యంత శక్తివంతమైన యురేనియంను వదులుకోవడానికి సిద్ధపడిందని ఆయన వెల్లడించారు.

సీబీఎస్ (CBS) వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరాగ్చీ ఈ అంతర్గత విషయాలను పంచుకున్నారు. ఫిబ్రవరి 26న జెనీవాలో జరిగిన చర్చల సందర్భంగా ఈ ప్రతిపాదనను అమెరికా ముందుంచినట్లు ఆయన తెలిపారు. ఒమన్‌ దేశం మధ్యవర్తిగా వ్యవహరిస్తూ, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్‌కు ఈ డీల్ తాలూకు వివరాలను అందజేసిందని ఆయన పేర్కొన్నారు.

"మా అమెరికా ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నప్పుడు, ఆ ఒప్పందంలో ఇరాన్ వద్ద ఉన్న 60 శాతం ...